Telugu Gateway
Andhra Pradesh

తెలుగుదేశంలో చేరిన బిజెపి నేత రఘురామ కృష్ణంరాజు

తెలుగుదేశంలో చేరిన బిజెపి నేత రఘురామ కృష్ణంరాజు
X

ఏపీలో రాజకీయ భవిష్యత్ లేకపోవటంతో బిజెపి నేతలు అందరూ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కొంటున్నారు. అందుకే సీనియర్ నేతలు వరస పెట్టి పార్టీలో మారే పనిలో ఉన్నారు. తాజాగా బిజెపి నేత రఘురామకృష్ణంరాజు శుక్రవారం టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. రఘురామకృష్ణంరాజును చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రం ప్రస్తుతం కీలకదశలో ఉందని...ఈ పరిస్థితిలో ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి అండగా ఉండాలని చంద్రబాబు కోరారు.

రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న తరుణంలో రఘరామకృష్ణం రాజు చేరికను స్వాగతిస్తున్నానని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోరుకునే ప్రతిఒక్కరూ తెలుగుదేశం పార్టీకి మద్ధతివ్వాలని కోరారు. హైదరాబాద్ లో ప్రతి అంగుళం అభివృద్ధిపై తన శ్రమముద్రలు ఉంటాయన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్, అవుటర్ రింగ్ రోడ్డు,ఐఎస్ బి,నల్సార్,హైటెక్ సిటి అన్నీ తాను అభివృద్ధి చేసినవే అని తెలిపారు.

Next Story
Share it