‘ఆఫీసర్’ సెన్సార్ పూర్తి
అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆఫీసర్’ సినిమా మంగళవారం నాడు సెన్సార్ పూర్తి చేసుకుంది. ‘శివ’ వంటి సూపర్ హిట్ సినిమా ద్వారా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇదే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ను జారీ చేశారు. కర్ణాటకు చెందిన ఐపీఎస్ అధికారి కేఎం ప్రసన్న జీవితం ఆధారంగా హీరో పాత్రను తీర్చి దిద్దారు. ఈ సినిమాలో మైరా సరీన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో నాగార్జున పోలీస్ అధికారిగా నటిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా వర్మకు సరైన హిట్ లేదు. మరి నాగార్జున, వర్మలు కలసి చేసిన సినిమా కావటంతో సహజంగానే దీనిపై అంచనాలు ఉంటాయి. మరి ఈ అక్కినేని హీరోకు వర్మ ఎలాంటి సినిమా ఇచ్చారో తెలియాలంటే జూన్ 1 వరకూ వేచిచూడాల్సిందే. నాగార్జున కూడా ఎంతో నమ్మకంతో ఈ సినిమా చేశారు.