Telugu Gateway
Andhra Pradesh

టీడీపీలో పెరిగిపోతున్న ‘తేడాసింగ్ లు’

టీడీపీలో పెరిగిపోతున్న ‘తేడాసింగ్ లు’
X

ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీలో ఈ మధ్య ‘తేడా సింగ్ లు’ పెరిగిపోతున్నారు. ఏకంగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ మొదలుకుని పలువురు నేతలు విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ కామెడీ పండిస్తున్నారు. తాజాగా చంద్రబాబునాయుడు ఏకంగా హైదరాబాద్ అభివృద్ధికి తాను 60 ఏళ్లు కష్టపడ్డాను అని విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు, లోకేష్ లు చేసిన ఇలాంటి కామెడీలు ఎన్నో. ఇప్పుడు ఆ జాబితాలో టీడీపీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ కూడా చేరిపోయారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. మురళీమోహన్ ఏకంగా ఇఫ్పుడు తిరుమల వెంకటేశ్వరస్వామిని ‘వెంకన్న చౌదరి’ అని వ్యాఖ్యానించారు. దీనికి వెనక ఉన్న లాజిక్ ను కూడా మురళీమోహన్ వివరించారు. కర్ణాటకలో బిజెపికి మెజారిటీ రాకుండా చేయటంలో వెంకటేశ్వరస్వామి హస్తం ఉందట.

ఈ కారణంగానే బిజెపి కర్ణాటకలో మెజారిటీకి దూరంగా ఉండిపోయిందట. వెంకన్న సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయనికారణంగా బిజెపిని వెంకన్న చౌదరి శిక్షించాడని మురళీమోహన్ వ్యాఖ్యానించటంతో అవాక్కు అవటం వేదికపై ఉన్న నేతల వంతు అయింది. మురళీమోహన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఈ వీడియో వాట్సప్ లో వైరల్ గా మారింది. టీడీపీ నేతలు చివరకు కోట్లాది మంది కొలిచే తిరుమల వెంకటేశ్వరస్వామికి కులం అంటకడతారా? అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే సర్కారు నిర్వాకాల కారణంగా టీటీడీ పలు వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈ తరుణంలో టీడీపీ ఎంపీ మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

https://www.youtube.com/watch?v=c8JRb4KunYs

Next Story
Share it