కొవ్వెక్కే జగన్ పాదయాత్ర
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి ఉమా మహేశ్వరరావు తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఒళ్లు కొవ్వెక్కి జగన్ పాదయాత్ర చేస్తున్నారని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు నిరసన ఎదురైతే వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఉలిక్కిపడుతున్నారని మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టిసీమపై సమాధానం చెప్పకుండా జగన్ తప్పించుకుంటున్నారని ఆరోపించారు.
జగన్ మదంతో పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని, చిట్టినగర్ సందులో చిట్టి జగన్ ఇష్టానుసారంగా మాట్లాడారని, బాంబులు పెట్టి కొల్లేరును ధ్వంసం చేసిన చరిత్ర వైఎస్దని దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విమర్శించారు. బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్ పిల్లర్ పనులు పూర్తి అయిన తర్వాత కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని మళ్లీ పునఃప్రతిష్టిస్తామని మంత్రి దేవినేని ఉమ స్సష్టం చేశారు. బెంజ్ సర్కిల్కి కాకాని వెంకటరత్నం పేరు పెడతామని తెలిపారు.