Telugu Gateway
Andhra Pradesh

తొమ్మిదేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం

తొమ్మిదేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం
X

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తొమ్మిదేళ్ళ బాలికపై 55 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం అందరినీ షాక్ కు గురిచేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లిలో చోటుచేసుకుంది. చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగిన ఈ దారుణంపై స్థానికులు నిందితుడి ఇంటిని ధ్వంసం చేశారు. దాచేపల్లిలో బాలికపై అత్యాచార ఘటనకు నిరసనగా ఆందోళనలు ఉధృతం అయ్యాయి. మాచర్లలో ముస్లింలు ఆందోళన చేశారు. రోడ్డుపై రాస్తారోకో చేశారు. నిందితుడు సుబ్బయ్యను వెంటనే అరెస్ట్‌ చేయాలని... ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాలికపై అఘాయిత్యం నేపథ్యంలో దాచేపల్లిలో చేపట్టిన బంద్‌ నిర్వహించారు. వ్యాపారస్తులు తమ దుకాణాలు మూసివేసి స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు.

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడ్ని శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దాచేపల్లిలో ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను... అదే గ్రామానికి చెందిన సుబ్బయ్య మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు చెబుతున్నారు. తల్లిదండ్రులకు చెప్తే చంపేస్తానని బెదిరించినట్టు కూడా తెలుస్తోంది. అనంతరం బాలికను తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపి వెళ్లాడని స్థానికులు చెప్తున్నారు. బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. వెంటనే బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గురజాల ఆస్పత్రికి తరలించారు. విషయం బయటపడడంతో సుబ్బయ్య పరారయ్యాడు. బాలిక బంధువులు ఆస్పత్రి దగ్గరకు చేరుకుని ఆందోళన చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story
Share it