Telugu Gateway
Andhra Pradesh

మోడీది ప్రచార ఆర్భాటమే

మోడీది ప్రచార ఆర్భాటమే
X

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మోడీకి ప్రచార యావ తప్ప..అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదని ధ్వజమెత్తారు. మంచి జరుగుతుందని ఉద్దేశంతోనే నోట్ల రద్దుకు మద్దతు ఇఛ్చామని తెలిపారు. కానీ రద్దు తర్వాత చేపట్టాల్సిన చర్యల విషయంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. టీడీపీ వార్షిక పండగ ‘మహానాడు’ ఆదివారం నాడు విజయవాడలో అట్టహాసంగా ప్రారంభం అయింది. మహానాడులో చంద్రబాబునాయుడు ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో పడిందని అన్నారు. తిరుమల వివాదం కూడా బిజెపి కుట్రే అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బిజెపి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తిరుమల వెంకన్నతో ఎవరు పెట్టుకున్నా మట్టికరవాల్సిందేనని హెచ్చరించారు.

విభజన హామీలు అమలు చేయాలని కోరినందునే టీడీపీపై కక్ష సాధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అన్నారు. దేశ రాజకీయాలను మార్చే శక్తి టీడీపీకి ఉందన్నారు. కాంగ్రెస్ పదేళ్ళ పాలన సమైక్యాంధ్రకు ఓ పీడకల అని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏపీలో విద్యుత్ కొరత లేకుండా చేయగలిగిందని అన్నారు. తెలుగుదేశానికి 70 లక్షల మంది కార్యకర్తల బలం ఉందని..కార్యకర్తలే టీడీపికి శక్తి అని పేర్కొన్నారు.

Next Story
Share it