Telugu Gateway
Telangana

ఐజెయు అధ్యక్షుడిగా దేవులపల్లి అమర్

ఐజెయు అధ్యక్షుడిగా దేవులపల్లి అమర్
X

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజెయు) అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన దేవులపల్లి అమర్, సెక్రటరీ జనరల్ గా సబీనా ఇంద్రజిత్ ఎన్నికయ్యారు. ఈ రెండు పోస్టులకు వీరిద్దరు మాత్రమే నామినేషన్లు వేయటంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ ఎన్నికను సోమవారం ఐజెయు ఎన్నికల సెంట్రల్ రిటర్నింగ్ అధికారి ప్రేమ్ నాథ్ భార్గవ ప్రకటించారు. దేవులపల్లి అమర్ గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్ట్ యూనియన్ నేతగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికకు ముందు వరకూ అమర్ ఐజెయు సెక్రటరీ జనరల్ గా ఉన్నారు.

Next Story
Share it