Telugu Gateway
Politics

ఎంపీ జీతం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసిన సచిన్

ఎంపీ జీతం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసిన సచిన్
X

మాజీ ఎంపీ సచిన్ టెండూల్కర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు వచ్చిన వేతనం, అలవెన్స్ ల మొత్తాన్ని ప్రధాన మంత్రి సహాయనిధికి ఇచ్చేశారు. తాజాగా సచిన్ రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. వేతనం, అలవెన్స్ లతో కలపి తనకు వచ్చిన మొత్తం 90 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని పీఎం రీలీఫ్‌ ఫండ్‌కు అందజేసినట్లు పీఎంవో వర్గాలు పేర్కొన్నాయి. రాజ్యసభ హాజరు విషయంలో నటి రేఖతో పాటు సచిన్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సచిన్‌ తన జీతాన్ని పీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది.

సచిన్‌ కార్యాలయం ఎంపీ లాడ్స్ ఎక్కడెక్కడ దేనికి ఖర్చు చేసింది కూడా తెలియజేసింది. తన రూ.30 కోట్ల ఎంపీ ల్యాడ్స్‌ ను దేశ వ్యాప్తంగా 185 ప్రాజెక్టులకు ఉపయోగించారు. సుమారు రూ.7.5 కోట్లు విద్యా సంబంధిత అభివృద్ది కార్యక్రమాలకు ఖర్చు చేశారు. ఇక సచిన్‌ ఆదర్శ్‌ గ్రామ యోజన కింద రెండు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో ఓ గ్రామం ఉండగా మరొకటి మహారాష్ట్రలో ఉంది. అయితే సచిన్ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story
Share it