Telugu Gateway
Cinema

మీడియా...సినీ పరిశ్రమ రాజీకి వచ్చాయా?

మీడియా...సినీ పరిశ్రమ రాజీకి వచ్చాయా?
X

ప్రస్తుత వాతావరణం చూస్తుంటే అలాగే కన్పిస్తోంది. దీనికి తోడు ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన హీరో రామ్ చరణ్ వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి. ‘మీరు హ్యాపీగా బతకండి. మమ్మల్ని హ్యాపీగా బతకనివ్వండి’ అంటూ రామ్ చరణ్ మీడియానుద్దేశించి వ్యాఖ్యానించారు. గత రెండు నెలలుగా జరిగిన సంఘనలు కొంత ఇబ్బందికి గురిచేశాయని వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం చిరంజీవి అధ్యక్షతన జరిగిన సినీ ప్రముఖుల సమావేశంలో మీడియాకు యాడ్స్ తోపాటు ఫీడ్ కూడా ఇవ్వొద్దంటూ ప్రాధమికంగా నిర్ణయం తీసుకున్నారు. మరోసారి సమావేశం అయి తుది నిర్ణయం తీసుకుందామని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.

కానీ ప్రస్తుత వాతావరణం చూస్తుంటే ఆ పరిస్థితి కన్పించటం లేదు. చిరంజీవి నిర్ణయంపై కొంత మంది విమర్శలు గుప్పించారు కూడా. మీకు నొప్పి తగిలితేనే బాధ వస్తుందా?...ఇతరులకు సమస్య వచ్చినప్పుడు మీరు రారా? అంటూ కొంత మంది ప్రశ్నించారు. ప్రస్తుతం మీడియా, సినీ పరిశ్రమ కూడా అన్ని అంశాలను వదిలేసి...ఎవరి పనిలో వారు మునిగిపోయారు. అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన రామ్ చరణ్ దేశంలో ఏదైనా వంద శాతం నిజాయతీగా ఉన్న పరిశ్రమ ఉందా? అంటే అది ఒక్క సినీ పరిశ్రమే అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it