చంద్రబాబు తిప్పటానికి ఢిల్లీలో చక్రాలు లేవు
BY Telugu Gateway2 April 2018 10:50 AM GMT
X
Telugu Gateway2 April 2018 10:50 AM GMT
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఇప్పుడు ఢిల్లీలో తిప్పటానికి చక్రాలు ఏమీలేవని బిజెపి ఎంపీ జీ వీ ఎల్ నరసింహరావు వ్యాఖ్యానించారు. గతంలో ఆయనే పలుమార్లు చక్రం తిప్పినట్లు ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయ ఉద్దేశాలతో ఆయన ఎన్డీయేను వీడి..రాజకీయంగా లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబే స్వయంగా సీఎంగా ఉండి 29 సార్లు ఢిల్లీ వెళ్ళి ఏమీ సాధించలేకపోయానని ప్రకటించారని...మరి ఇప్పుడు ఏమి సాదించగలరని ప్రశ్నించారు. ఏపీలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు బిజెపిపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
Next Story