మళ్ళీ మొదటికొచ్చిన అగ్రిగోల్డ్ కేసు
BY Telugu Gateway9 April 2018 4:38 PM GMT
X
Telugu Gateway9 April 2018 4:38 PM GMT
అగ్రిగోల్డ్ బాధితులకు చేదు వార్త. ఇంత కాలం ఈ కంపెనీ టేకోవర్ పూర్తవుతుంది..న్యాయం జరుగుతుందని భావించిన వారికి షాకింగ్ న్యూస్. ఈ టేకోవర్ ప్రక్రియ నుంచి జీ ఎస్సెల్ గ్రూప్ వెనక్కి పోయింది. దీంతో వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చినట్లు అయింది. అగ్రిగోల్డ్ ఆప్పుల విలువ ఆస్తుల విలువ కన్నా నాలుగింతలు ఎక్కువ ఉన్నాయంటూ ..అందుకే వెనకడుగు వేసినట్లు పేర్కొంది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవటానికి మరింత సమయం కావాలని కోరగా...అందుకు కోర్టు నిరాకరించింది. అమర్ సింగ్ జోక్యం చేసుకుని ప్రభుత్వంతో చర్చిస్తామన్నారని పేర్కొనగా..ప్రభుత్వాన్ని తమ సమాధానం చెప్సాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
Next Story