Telugu Gateway
Telangana

వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా

వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా
X

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ రెండు రోజుల చెన్నయ్ పర్యటన ముగిసింది. ఆదివారం నాడు కరుణానిధి, స్టాలిన్ లతో భేటీ అయిన ఆయన..సోమవారం నాడు డీఎంకె ఎంపీ కనిమొళితో సమావేశం అయ్యారు. కెసీఆర్ ప్రాంతీయ పార్టీలను ఏకంగా చేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను కనిమొళికి వివరించగా..ఆమె కెసీఆర్ ప్రయత్నాలను స్వాగతించారు. త్వరలోనే తాను హైదరాబాద్ లో పర్యటించటంతో పాటు..కాళేశ్వరం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పరిశీలిస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా కెసీఆర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందని పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్ ల కంటే ఈ పార్టీలకే ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం తన అదికారాలను కుదించుకుని..రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలని కెసీఆర్ కోరుతున్నారు.

Next Story
Share it