ఎన్టీఆర్..త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్
ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆయన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. జై లవకుశ సినిమా సక్సెస్ తర్వాత విరామం తీసుకున్న ఎన్టీఆర్..కొత్త సినిమా లుక్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. జిమ్ లో విదేశీ ట్రైనర్ తో కలసి భారీ కసరత్తులే చేశారు. ఈ ఫస్ట్ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తీయనున్నారని టాలీవుడ్ టాక్. ఈ ఫైట్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తన సిక్స్ ప్యాక్ బాడీని చూపించే అవకాశం ఉంది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్పై యస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘‘త్రివిక్రమ్ అద్భుతమైన కథను తయారు చేశారు. ఎన్టీఆర్ బ్రాండ్ న్యూ లుక్లో కనిపించనున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓ నవల ఆధారంగా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటించనున్నారు.