Telugu Gateway
Andhra Pradesh

ప్రధాని మోడీపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోడీపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో శుక్రవారం నాడు చేపట్టిన ధర్మదీక్షలో టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీని హిందీలో తిట్టేశారు. మోదీని శిఖండి అని, తరిమితరిమి కొడతామని అన్నారు. ‘‘సామదానబేధదండోపాయాలు అంటారుకదా.. ఇప్పుడు చివరి దశలో ఉన్నాం. మోసం చేసిన మోదీని తరిమితరిమి కొట్టాలి. ఒక్క ఏపీలోనేకాదు దేశమంతటా ఆయనపై వ్యతిరేకత ఉంది. మోదీ.. నీకు తెలుగువాళ్ల ఘోష వినిపించట్లేదా? అయితే ముందు తెలుగు నేర్చుకో. దానితోపాటు పెద్దల్ని గౌరవించడం నేర్చుకో. అన్నింటికన్నా ముఖ్యంగా నీ భార్యను ప్రేమించడం తెలుసుకో.

అమిత్ షా వంటి నీకు బాకా ఊదేవాళ్ల మాటలు వినకు. ఏపీకి అన్యాయం చేసిన నువ్వు ఒక ద్రోహివి. నిన్ను కొట్టి కొట్టి తరుముతాం, బంకర్‌లో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతాం. ఒకప్పుడు నీ బీజేపీకి రెండు సీట్లు కూడా లేవు. వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాదు. చిల్లర రాజకీయాలు, కుప్పిగంతులు మానెయ్‌. ఎవరెవరినో అడ్డం అడ్డంపెట్టుకుని వ్యవహారాలు సాగిస్తున్నశిఖండివి నువ్వు’’ అని బాలకృష్ణ అన్నారు. రాజధాని శంకుస్థాపనకు మోదీ మట్టి, పవిత్ర జలాలను తేవడాన్ని గుర్తుచేస్తూ.. ‘ఏం మా దగ్గరలేవా మట్టి, నీళ్లూ?’ అని ప్రశ్నించారు. ఏపీ పౌరుడు ఒక్కొక్కరు ఒక గౌతమీపుత్ర శాతకర్ణిలా మారి బీజేపీపై, మోదీపై పోరాటం చేయాలని బాలయ్య పిలుపునిచ్చారు.

Next Story
Share it