Telugu Gateway
Top Stories

నీరవ్..లలిత్ లు నరేంద్రమోడీ ఫ్యామిలీనే

నీరవ్..లలిత్ లు నరేంద్రమోడీ ఫ్యామిలీనే
X

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్లీనరీ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పై తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని లూటీ చేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ, లలిత్ మోడీ లు ప్రధాని నరేంద్ర మోడీ ఫ్యామిలీవారే అని వ్యాఖ్యానించారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్నారని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో రాహుల్ ముగింపు ఉపన్యాసం చేశారు. వేల సంవత్సరాల క్రితం కౌరవులు-పాండవుల మధ్య యుద్దం జరిగిందని..కౌరవుల్లా బిజెపి, ఆర్ఎస్ఎస్ లు అధికారం కోసం పోరాటం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. పాండవుల్లా కాంగ్రెస్ పార్టీ నిజాయతీ, సత్యం కోసం పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలు కాంగ్రెస్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని..వారి ఆశలు నెరవేరుస్తామని తెలిపారు. బిజెపి ఆర్ఎస్ ఎస్ గళంగా పనిచేస్తే..కాంగ్రెస్ పార్టీ జాతి కోసం పనిచేస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడ చూసినా చైనా ఉత్పత్తులే కన్పిస్తున్నాయి కానీ..యువతకు ఉద్యోగావకాశాలు దక్కటం లేదన్నారు.

దేశంలో ఏ యువతను కదిలించినా ఇదే పరిస్థితి కన్పిస్తోందని అన్నారు. తాను దేవాలయాలను సందర్శిస్తే దాన్ని కూడా వివాదం చేశారని..తాను దేవాలయాలతో పాటు మసీదులు..చర్చిలకు కూడా వెళతానని..తనకు ప్రేమించటం తప్ప...ద్వేషించటం తెలియదని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న మోడీ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా రైతులను ఆకట్టుకునేందుకు పలు రకాల స్కీమ్ లు ప్రకటిస్తోంది. దీంతోపాటు పలు రాష్ట్రాల్లోని పార్టీలను కలుపుకుని ముందుకు పోయేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. సిద్ధూ వంటి నేతలు ప్లీనరీలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఎన్నికల తర్వాత ఎర్రకోటపై జెండా ఎగరేస్తారని అన్నారు.

Next Story
Share it