ఎన్టీఆర్..రామ్ చరణ్, రాజమౌళి
అధికారిక ప్రకటన వచ్చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళిల సినిమాపై డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ ఓ వీడియోను విడుదల చేసి..సస్పెన్స్ కు తెరదించింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు సినిమా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నా ఏదీ అధికారికంగా ప్రకటించలేదు. కాకపోతే ఇప్పుడు అధికారిక ప్రకటన రావటంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఫుల్ కుషీగా ఉన్నారు. ఇద్దరు టాప్ లతో వచ్చే మల్టీస్టారర్ అంటే మామూలు విషయం కాదు. అందునా ఈ సినిమాను తెరకెక్కించేందుకు దర్శక దిగ్గజం రాజమౌళి కావటంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్ లో ఉండటం సహజం. బాహుబలి తర్వాత కొత్త సినిమాపై ఇప్పటివరకూ రాజమౌళి ఎలాంటి ప్రకటన చేయలేదు.తాజా ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది.
కొద్ది రోజుల క్రితమే ఎన్టీఆర్, రామ్ చరణ్లు ఈ సినిమా ఫోటోషూట్ కోసం విదేశాలకు కూడా వెళ్లొచ్చారు. అన్ని ఒకే అవ్వటంతో సినిమాను అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో టీజర్ ను రిలీజ్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ అనే లోగో తో రిలీజ్ అయిన ఈ టీజర్ లోని మూడు ఆర్లు రాజమౌళి, రామ్చరణ్, రామారావు (ఎన్టీఆర్)ల పేర్లు ప్రతిబింభించేలా డిజైన్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ అనేది టైటిల్ కాదు కేవలం ఈ మెగా కలయికకు ప్రతీకగా ఈ లోగోను రిలీజ్ చేసినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించింది.
https://www.youtube.com/watch?v=Y00cvQP9oL4&feature=youtu.be