Telugu Gateway
Andhra Pradesh

ఏపీ కేబినెట్ కు బిజెపి మంత్రుల గుడ్ బై

ఏపీ కేబినెట్ కు బిజెపి మంత్రుల గుడ్ బై
X

తెలుగుదేశం యాక్షన్. బిజెపి రియాక్షన్. ప్రత్యేక హోదాతోపాటు పలు అంశాల్లో న్యాయం చేయటంలేదని ఆరోపిస్తూ కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులు వైదొలగాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగానే ఏపీ కేబినెట్ లో కొనసాగుతున్న బిజెపి మంత్రులు కూడా తమ పదవులకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.

మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు లు సీఎం చంద్రబాబును కలసి రాజీనామాలు సమర్పించారు. అయితే మంత్రివర్గం నుంచి తప్పుకుంటున్నందుకు ఎలాంటి బాధలేదని..రాజకీయాల్లో ఇవన్నీ సహజమే అని మంత్రి కామినేని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి టీడీపీ బయటకు రావాలని నిర్ణయించుకోవటంతో తాము కూడా ఇక్కడ మంత్రివర్గం నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు మాణిక్యాలరావు తెలిపారు. సభలో కూడా రాజీనామా చేసిన మంత్రులు మాట్లాడే అవకాశం ఉంది. కేంద్రంలో టీడీపీ మంత్రుల కంటే ముందుగానే ఏపీలో బిజెపి మంత్రులు రాజీనామాలు సమర్పించారు.

Next Story
Share it