Telugu Gateway
Cinema

‘భరత్ అను నేను’ ఫస్ట్ సాంగ్ విడుదల

‘భరత్ అను నేను’ ఫస్ట్ సాంగ్ విడుదల
X

సమ్మర్ లో సందడి చేయటానికి మహేష్ బాబు రెడీ అవుతున్నాడు. భరత్ అను నేను సినిమాతో ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా సినిమాకు సంబంధించిన వివరాలను షేర్ చేసుకుంటున్న చిత్ర యూనిట్ ఆదివారం నాడు ఈ సినిమాకు సంబంధించిన తొలి పాటను విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యమందించిన ఈ పాటను డేవిడ్ సిమాన్‌ ఆలపించారు.

మహేష్ బాబు ముఖ్య మంత్రిగా నటిస్తున్న భరత్‌ అనే నేను సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. డివివి ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ పాట పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోది కావటంతో ప్రేక్షకులకు అంత కిక్కు ఇచ్చేలా కన్పించటం లేదు. నినదిస్తా నిత్యం జనహితం అంటూ ఈ పాట మొదలవుతుంది. ఈ పాట చాలా స్లోగా...ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు సిద్దం అన్న సందేశం ఇస్తుంది.

https://www.youtube.com/watch?v=2wGSKHW2PvI

Next Story
Share it