Telugu Gateway
Cinema

చేపలకు కన్నీళ్లుంటాయ్.. ఫిబ్రవరి 16న ‘అ!’ విడుదల

చేపలకు కన్నీళ్లుంటాయ్.. ఫిబ్రవరి 16న ‘అ!’ విడుదల
X

హీరో నాని నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ‘అ!’. ఈ సినిమా విడుదల ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 16న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది. అందులో డైలాగ్ లు అదిరిపోయేలా ఉండటంతో పాటు..పేరు తరహాలోనే ట్రైలర్ కూడా వినూత్నంగా ఉంది. చేపకు వాయిస్ ఇచ్చిన నాని డైలాగు ఆసక్తికరంగా ఉంది. ‘చేపలకు కూడా కన్నీళ్ళుంటాయ్. అవి నీళ్లలో ఉంటాయ్ కదా. కనపడవు అంతే.’ అన్న డైలాగ్ ఈ ట్రైలర్ లో హైలెట్ గా నిలుస్తుంది.

ఇందులో కాజల్, నిత్యామీనన్, రెజీనా కసాండ్రా, మురళీశర్మలు కీలకంగా కన్పిస్తారు. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రచార చిత్రాలు...ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. హీరోగా నాని వరస పెట్టి హిట్లు కొడుతూ దూసుకెళుతున్నాడు. మరి నిర్మాతగా మారిన నాని తొలి సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటారో వేచిచూడాల్సిందే.

https://www.youtube.com/watch?v=xOEscQChX7M

Next Story
Share it