దావోస్ లో చంద్రబాబు..కెటీఆర్..లోకేష్ ఫోటోసెషన్
BY Telugu Gateway23 Jan 2018 4:25 PM GMT
X
Telugu Gateway23 Jan 2018 4:25 PM GMT
దావోస్ లో తెలుగు రాష్ట్రాల ప్రతినిధుల హంగామా కొనసాగింది. అంతే కాదు..ఫోటోసెషన్ కూడా జోరుగా సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ ల ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాదు..మంత్రులు కెటీఆర్, లోకేష్, ఎంపీ గల్లా జయదేవ్ లు కూడా దావోస్ లు ఫోటోలు దిగారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఎకనామిక్ ఫోరంలో తెలుగు నేతలు కలుసుకుని..ఫోటోలకు ఫోజులిచ్చారు.
విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి కెటీఆర్, మరో మంత్రి లోకేష్ లు ఇలా ఓ విదేశీ వేదికలో కలుసుకోవటం ఇదే మొదటి సారి. రెండు రాష్ట్రాలు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశంలో పాల్గొనటంతో పాటు..అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story