Telugu Gateway
Telugu

రాజ‌కీయాల‌పై ప్ర‌కాష్ రాజ్ ఫైర్

ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ మ‌రోసారి కేంద్రంలోని నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న తీవ్ర స్థాయిలో స్పందించారు. కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డే తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. హిందుత్వం-జాతీయత ఒక్కటేనని హెగ్డే ఈ మధ్య వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నేషనలిజం, హిందుత్వం ఒక్కటేనని చెబుతున్న మంత్రి ఆ మాటకు అర్థం కూడా వివరిస్తే బాగుంటుందని తొలుత ప్రకాశ్‌ రాజ్‌ మొదట ఓ ట్వీట్‌ చేశారు. ఇస్లాం మతాన్ని ప్రపంచంలోనే లేకుండా చేయాలని ఆయన భావిస్తున్నారేమోనంటూ అనంతకుమార్‌ మాట్లాడిన వీడియోను పోస్టు చేశారు.

త‌ర్వాత‌ అసలు విమర్శలతో ఓ పోస్టును ప్రకాశ్‌ ఉంచారు.‘‘ ఆ రెండూ ఒకటేనని అంటున్నప్పుడు అసలు మతం విషయాన్ని లేవనెత్తటం ఎందుకు? అంబేద్కర్‌, అబ్దుల్‌ కలాం, రెహమాన్‌, కుష్వంత్‌ సింగ్‌, అమృత ప్రీతమ్‌, డాక్టర్‌ కురియన్‌ వీరంతా ఎవరు?. నాలాగా మతాన్ని కాకుండా మానవత్వాన్ని నమ్మేవారి పరిస్థితి ఏంటి? మేం ఈ దేశానికి చెందిన వాళ్లం కాదా? అసలు మీ ఏజెండా ఏంటి? పునర్జన్మను బలంగా నమ్మే మీరంతా నియంత హిట్లర్‌కు ప్రతీకలా? సెక్యులర్‌ దేశం మనందరిది. ఈ సిగ్గులేని రాజకీయాలతో మీకు ఒరిగేది ఏంటి? అంటూ ప్రకాష్‌ రాజ్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

Next Story
Share it