Telugu Gateway
Andhra Pradesh

చంద్ర‌బాబుకు జ‌గ‌న్ స‌వాల్‌

ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ‌హిరంగ స‌వాల్ విసిరారు. త‌న‌కు విదేశాల్లో ఒక్క పైసా ఉన్న‌ట్లు చంద్ర‌బాబు నిరూపించినా తాను రాజ‌కీయాల నుంచి శాశ్వ‌తంగా వైదొలుగుతానిన ప్ర‌క‌టించారు. లేదంటే ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి చంద్ర‌బాబు రాజీనామా చేస్తారా.? అని స‌వాల్ విసిరారు. ప్యార‌డైజ్ పేప‌ర్ల‌లో జ‌గ‌న్ పేరుండ‌టం సిగ్గుచేటు అని..దేశంలో ఏ కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డినా అందులో జ‌గ‌న్ పేరు ఉంటుంద‌ని..దీని ద్వారా రాష్ట్ర ప్ర‌తిష్ట దెబ్బ‌తింటుంద‌ని చంద్ర‌బాబు పార్టీ స‌మావేశంలో వ్యాఖ్యానించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. వీటిపై జ‌గ‌న్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ‘చంద్రబాబుకు 15 రోజుల సమయం ఇస్తున్నా.. చేత‌నైతే విదేశాల్లో త‌న‌కు డ‌బ్బులు ఎక్క‌డ ఉన్నాయో చూపించాల‌ని చాలెంజ్ చేశారు.

మూడోరోజు పాదయాత్రలో భాగంగా వైఎస్సార్‌ జిల్లా వీఎన్‌పల్లి సంగమేశ్వరాలయం జంక్షన్‌లో ప్రజలను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ మాట్లాడారు.ఈ సందర్భంగా ప్యారడైజ్‌ పేపర్ల లీక్‌ గురించి స్పందించిన ఆయన.. తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో కావాలనే తన పేరుతో కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ ఏదైనా గొప్ప కార్యక్రమం మొదలుపెడుతున్నాడని తెలియగానే.. ఇలాంటి ప్రచారాలు చేయడం, చంద్రబాబుకు, ఆయన తోక పత్రికలు, చానెళ్లకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు

Next Story
Share it